International Tolerance Award 2026: అబుదాబిలోని బోచసన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ్ (BAPS) హిందూ దేవాలయం ప్రతిష్టాత్మకమైన ‘2026 అంతర్జాతీయ సహన పురస్కారం’ను గెలుచుకోవడం ద్వారా మరో చారిత్రాత్మక ఘనతను సాధించింది. ప్రపంచ స్థాయిలో శాంతి, సహనం, పరస్పర గౌరవం, మానవ ఐక్యతను ప్రోత్సహించడంలో చేసిన గణనీయమైన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేస్తారు.
మూడవ అంతర్జాతీయ సిసిలియేషన్ – టాలరెన్స్ డైలాగ్ కాన్ఫరెన్స్ (IDCT 2026) సందర్భంగా ఈ గౌరవాన్ని ప్రకటించారు. విభిన్న మతాలు, సంస్కృతులు, వర్గాల మధ్య సామరస్య వారధిగా పనిచేస్తున్న BAPS దేవాలయం సేవా కార్యక్రమాలు ప్రపంచదృష్టిని ఆకర్షించాయి.
సామరస్యానికి చిహ్నంగా గుర్తింపు..
International Tolerance Award 2026: అబుదాబి హిందూ దేవాలయం మత, భాషా, సాంస్కృతిక భేదాలకు అతీతంగా ప్రజలను ఏకం చేయడం ద్వారా ప్రపంచ సహజీవన సందేశాన్ని వ్యాప్తి చేస్తోంది. సమాజంలో ఐక్యతను పెంపొందించే కార్యక్రమాలు, మానవతా సేవలు, సంక్షోభ సమయాల్లో అందించిన సేవలకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రదానం చేశారు.
కుటుంబ విలువల ప్రాముఖ్యత..
International Tolerance Award 2026: అవార్డును స్వీకరిస్తూ, BAPS సంస్థ ఆధ్యాత్మిక నాయకులు సాంకేతికత, ఆధ్యాత్మికత మధ్య సమతుల్యత ఆవశ్యకతను వివరించారు. సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా, మానవ విలువలు, కుటుంబ బంధాలు,పరస్పర సంబంధాల ప్రాముఖ్యత తగ్గకూడదని వారు అన్నారు.
కుటుంబ సభ్యులు ప్రతిరోజూ ప్రార్థన, ఆత్మపరిశీలన, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. మొబైల్ ఫోన్లు, డిజిటల్ పరికరాల వాడకాన్ని పరిమితం చేసుకుని, కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడం సామాజిక సామరస్యానికి అత్యవసరం అని వారు సలహా ఇచ్చారు.
శాంతి – మానవత్వ సందేశానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు:
ప్రపంచవ్యాప్తంగా శాంతి, కరుణ, సౌభ్రాతృత్వం, మానవ విలువలను వ్యాప్తి చేసే లక్ష్యంతో బిఎపిఎస్ హిందూ మందిర్ చేపట్టిన వివిధ కార్యకలాపాలకు ఈ పురస్కారం మరో గొప్ప గుర్తింపు. ప్రస్తుతం ఈ ఆలయం కేవలం ఒక పూజా కేంద్రంగానే కాకుండా, విభిన్న మతాలు – సంస్కృతులను కలిపే సామరస్యానికి ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
HYDERABAD WEATHER Hyderabad WEATHER